పరీక్షలు లేకుండానే పై తరగతులకు

పరీక్షలు లేకుండానే పై తరగతులకు
x
file photo
Highlights

తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుంది. దీంతో పాఠశాలల్లో ప్రస్తుతం...

తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుంది. దీంతో పాఠశాలల్లో ప్రస్తుతం తరగతులను, పరీక్షలను నిర్వహించే అవకాశం లేదు. అయినా 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు నిర్వహించాల్సిన తరగతులు, పరీక్షల సమయం కూడా దాటిపోయింది. దీంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకప్పటికే వాయిదా పడిన పదోతరగతి పరీక్షలను ఎప్పుడు నిర్వహించడమో అన్న విషయాన్ని ప్రభుత్వం తెలపాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories