నగరాలను పట్టిపీడిస్తోన్న కాలుష్య భూతం

నగరాలను పట్టిపీడిస్తోన్న కాలుష్య భూతం
x
Highlights

వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్న డీజిల్‌ వాహనాలపై ఆంక్షలు విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాటిని నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది.

వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్న డీజిల్‌ వాహనాలపై ఆంక్షలు విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో వాటిని నియంత్రించేందుకు రవాణాశాఖ త్వరలో ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్య మన నగరాన్ని తాకేంత వరకు చూడకుండా తొందరగానే మేల్కోవాలని సర్కారు యోచిస్తోంది. నగరాన్ని వాహనాల పొగ ఉక్కిరిబిక్కిరి చేయకముందే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల సదస్సులో మాట్లాడినట్లు తెలిసింది.

హైదరాబాద్‌ నగర రహదారులపై దాదాపు 15 లక్షల డీజిల్‌ వాహనాలు తిరుగుతున్నాయి. వీటి నుంచి పెద్ద మొత్తంలో కార్బన్ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజిల్‌ వాహనాల సంఖ్య పెరగకుండా చూడాలని సర్కారు భావిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌ వాహనాల కంటే డీజిల్‌ వాహనాలపై 2 శాతం జీవిత పన్ను అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే దీనిని చాలామంది పెద్ద భారంగా భావించడంలేదు. దీంతో ఈ పన్ను మొత్తాన్ని మరింత పెంచితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇక 12 ఏళ్లు తిరిగిన డీజిల్‌ వాహనాలను నిషేధించాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం.

అదే సమయంలో బ్యాటరీ వాహనాలకు పన్నులు, ఇతరత్రా అంశాల్లో మినహాయింపులు ఇవ్వడం ద్వారా జనం వాటి పట్ల ఆకర్షితులయ్యేలా చూడాలని యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ప్రభుత్వానికి రవాణాశాఖ ప్రతిపాదనలు ఇవ్వనున్నారు. ఇక డిజిల్ వాహనాల ఆంక్షల పై పర్యావరణవేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. నగరంలో సగానికి పైగా కాలుష్యం వాహనాల వల్లే 50 శాతం అవుతున్నాయని ఇప్పటికైన ప్రజల్లో అవగాహన కల్పించాలని పర్యావరణవేత్త జీవానంద రెడ్డి తెలిపారు. 12 సంవత్సరాల పైబడిన వాహనాల నిషేధంతో పాటు, చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత కల్పించాలన్నారు. నగరంలోకి లారీల నిషేధం విధించినప్పుడే కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.

గతంలో రవాణాశాఖ చేసిన ప్రతిపాదనల పునఃసమీక్ష, నిపుణులు ఇచ్చిన నివేదికలోని వివరాల ఆధారంగా కొత్త ప్రతిపాదనలు ఇవ్వడం వంటి అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తెలంగాణ మోటారు వాహన చట్టానికి సవరణలు చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. దీని ద్వారా కాలుష్యాన్ని వెదజల్లే డిజిల్ వాహనాలను నియంత్రించవచ్చని భావిస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories