ప్రియాంక కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి : సినీ నటి హేమ

ప్రియాంక కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి : సినీ నటి హేమ
x
Hema
Highlights

సమాజం , పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి ‌: సినీ నటి హేమ

ప్రియాంక రెడ్డి కేసులో నిందితులకు అతి కఠిన శిక్ష విధించాలని సినీ నటి హేమ అన్నారు. ఏదైన ఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే ఎందుకు స్పందించడం లేదని తెలిపారు. ప్రియాంకరెడ్డి ఉదంతంపై కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు. సమాజం, పోలీసు వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన అమానుషం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపి తగులబెట్టిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అందరూ తమ ఇంట్లో ఆడబిడ్డగా భావించి స్పందించారు. తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బాధతో ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినవారిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో గొంతెత్తారు. అన్ని రంగాల వారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories