రేవంత్ రెడ్డిలా రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయిన నాయకుడు మరొకరు కనిపించలేదు: పోసాని

రేవంత్ రెడ్డిలా రూ.50 లక్షలు ఇస్తూ దొరికిపోయిన నాయకుడు మరొకరు కనిపించలేదు: పోసాని
x
posani krishna murali(File photo)
Highlights

తెలుగు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు.

తెలుగు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు.ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశిస్తే కేటీఆర్ ను మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటి? ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదని పోసాని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మంత్రి కేటీఆర్ జీవో 111 నిబంధనలను అతిక్రమించి జన్వాడలో ఫాం హౌస్‌ను అక్రమంగానిర్మించారంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించింది. విచారణ జరుతున్నందున కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ విషయంపై పోసాని స్పందించి కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రూ.50లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి అని ఈరోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరని స్పష్టం చేసారు.

కేటీఆర్, హరీష్ రావు నిజాయితీపరులైన రాజకీయ నేతలు అని వీరే భవిష్యత్ తెలంగాణ కు రెండు కళ్ళ లాంటి వారు అని ఆయన అన్నారు. ఇలాంటి వ్యక్తి.. కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఏంటి? ఉన్న మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం ఏంటి? ' అని పోసాని అన్నారు. కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్లే కేటీఆర్ ఉంటారని, ఎక్కడ ఎలా ఉండాలో కేటీఆర్ కు బాగా తెలుసని పోసాని చెప్పారు. టీఆర్ఎస్ ను ఓడించాలని రాజకీయాలు చేస్తే ఎప్పటిరీ ప్రతి పక్షంలోనే ఉంటారని చెప్పారు. కేటీఆర్ అవినీతి ని ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే రేపటి నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతానని ఆయన ప్రకటించారు. ఫాం హౌస్ విషయంలో ఇప్పటికే కేటీఆర్ స్పందించారని తెలిపారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో కట్టారని ఆసయంలో అప్పుడు కమిషన్ల కోసమే కట్టారంటే ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. ఇప్పుడు కాళేశ్వరంలో కమిషన్ అంటే కూడా అలాగే ఉంటుందన్నారు. ఇంత మంది ప్రాజెక్టు కడితే కమిషన్ కోసం కాళేశ్వరం కట్టారంటూ ఉత్తమ్, జానారెడ్డిలాంటి వారు విమర్శించడం తగదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories