ఘటనాస్థలికి నిందితుల తల్లిదండ్రులు

ఘటనాస్థలికి నిందితుల తల్లిదండ్రులు
x
Highlights

దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు. అక్కడే గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చి డాక్టర్లు నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ,...

దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలోనే పంచనామా నిర్వహిస్తున్నారు. అక్కడే గాంధీ ఆస్పత్రి నుంచి వచ్చి డాక్టర్లు నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహిస్తున్నారు. నిందితుల తల్లిదండ్రులను పోలీసులు శంషాబాద్ కు తీసుకుని వచ్చారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇప్పటికే పంచనామా నిర్వహిస్తున్నారు, శవ పంచనామా పూర్తి కాగానే, వారి తల్లిదండ్రులు, ముఖ్య బంధువుల సమక్షంలోనే మృతదేహాలను వారికి అప్పగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఆపై సాయంత్రంలోగా వారికి అంత్యక్రియలను ఎవరి సంప్రదాయాల ప్రకారం వారు నిర్వహించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories