అల వైకుంఠపురం సినిమా నిర్మాణ సంస్థపై కేసు

అల వైకుంఠపురం సినిమా నిర్మాణ సంస్థపై కేసు
x
Highlights

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన అల వైకుంఠపురం సినిమా ఈవెంట్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన అల వైకుంఠపురం సినిమా ఈవెంట్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ రోజు సినిమా మ్యూజిక్ కాన్సర్ట్‌ను శ్రేయాస్ మీడియా, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్వహించింది. అనుమతి తీసుకున్న సమయాని కన్నా అదనంగా కార్యక్రమాన్ని నిర్వహించారని, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది.

ఈ మేరకు శ్రేయాస్ మీడియా ఎండీ, నిర్మాణ సంస్థ మేనేజర్‌లపై కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 5 నుంచి 6 వేల మంది అభిమానులు వస్తారని, రాత్రి 10 గంటల్లోపు కార్యక్రమం ముగుస్తుందని చెప్పారని తెలిపారు. అయితే దాదాపు 15 వేల మందిని నిర్మాణ సంస్థ ఆహ్వానించిందని, ఆరు వేల మంది దాటరని చెప్పి, మరింత మందిని తరలించడంతో ట్రాఫిక్ తీవ్ర ఆటంకం ఏర్పడిందని అభియోగాలు నమోదు చేశారు. రాత్రి 11.30 గంటల వరకూ కార్యక్రమం జరిగిందని, కార్యక్రమ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పోలీసులు అభిమానులను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.









Show Full Article
Print Article
More On
Next Story
More Stories