దారుణం : వృద్ధుడిని పీక్కుతిన్న పందులు..హృదయ విదారకర ఘటన

దారుణం : వృద్ధుడిని పీక్కుతిన్న పందులు..హృదయ విదారకర ఘటన
x
Highlights

వృధ్యాప్యంలో కన్నతండ్రికి నాలుగు మెతుకులు పెట్టి అతని బాగోగులు చూడాల్సిన ఓ కొడుకు ఆ తండ్రిని నిర్లక్ష్యం చేసాడు. చివరికి అతను చనిపోగా అతని శరీర...

వృధ్యాప్యంలో కన్నతండ్రికి నాలుగు మెతుకులు పెట్టి అతని బాగోగులు చూడాల్సిన ఓ కొడుకు ఆ తండ్రిని నిర్లక్ష్యం చేసాడు. చివరికి అతను చనిపోగా అతని శరీర భాగాలను పందులు పీక్కుతిన్న పరిస్థితికి వచ్చింది. ఈ ఘటన నాగూర్ కర్నూల్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానికుల కథనం ప్రకారం.. బిజినెపల్లి మండలం నందివద్దనం గ్రామానికి చెందిన సి కొండయ్య (80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. అతనికి వైద్యం అందించాల్సిన అతని కొడుకు అతని పట్ల దారుణంగా వ్యవహరించాడు. అతని ఇంటి ముందు ఓ షెడ్డుని నిర్మించి అందులో తన తండ్రిని ఉంచాడు.

అయితే అనారోగ్యం మరింత పెరగడంతో కొండయ్య ఆ షెడ్డులోనే మరణించాడు. ఆ షెడ్డులో నుంచి బయటకు వచ్చి తిరుగుతున్న పందుల మూతికి రక్తం ఉండటాన్ని గమనించిన స్థానికులు అనుమానం వచ్చి షెడ్డులో చూడగా ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ఘటన అక్కడివారిని కలవరానికి గురిచేసింది. కొండయ్య తల భాగాన్ని, ఓ చేతిని పందులు పీక్కు తినేసి, రక్తం తాగాయి...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories