ఘరానా మోసం..పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిపి డీజిల్ అమ్మకం

ఘరానా మోసం..పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిపి డీజిల్ అమ్మకం
x
Highlights

రంగారెడ్డి జిల్లాలో కల్తీ డీజిల్ వ్యవహారం బయటపడింది. హయత్ నగర్ లోని హాయత్ హెచ్ పీ పెట్రోల్ బంక్ లో నీళ్లు కలిపిన డూప్లికేట్ డీజిల్ పొస్తున్నారు. కల్తీ...

రంగారెడ్డి జిల్లాలో కల్తీ డీజిల్ వ్యవహారం బయటపడింది. హయత్ నగర్ లోని హాయత్ హెచ్ పీ పెట్రోల్ బంక్ లో నీళ్లు కలిపిన డూప్లికేట్ డీజిల్ పొస్తున్నారు. కల్తీ డీజిల్ తో నలుగు కార్లు, 20 ఆటోలు ఆగిపోయాయి. రాత్రి కురిసిన వర్షంతో డీజిల్ లో నీళ్లు కలిశాయని పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళన కు దిగడంతో పెట్రోల్ బంక్ యాజమాని, సిబ్బంది పరారయ్యారు. గతంలో హాయత్ పెట్రోల్ బంక్ లో మూడు సార్లు కల్తీ ఘటనలు జరిగాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories