కరోనా భయంతో ఊరు వదిలివెళ్లిన ప్రజలు..

కరోనా భయంతో ఊరు వదిలివెళ్లిన ప్రజలు..
x
Highlights

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గంట గంటకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.ఏం చేస్తే తమకు కరోనా సోకదో అని వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గ్రామం ప్రజలు తమ గ్రామాన్ని, ఇండ్లను వదిలేసి తమ తమ పంట పొల్లాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వారికి కావలసిన నిత్యావసరాలను ఒకే సారి తీసుకుని గ్రామం వదిలి వెల్లిపోయారు.

ఈ వింత సంఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ మండల కేంద్రంలోని మధురా నగర్‌లో చోటు చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరై వచ్చిన వారిలో ముగ్గురికి ఒకే రోజు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారిని వైద్యులు వెంటనే క్వారైంటన్‌కు తరలించారు.

ఈ విషయం తెలియగానే గ్రామస్థులు ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన వారు ఆందోళన చెందారు. పాజిటివ్ అని తేలిన ఆ ముగ్గురు వ్యక్తులు పదిరోజులుగా నేరేడుకొండలోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. వారి బంధువులను, స్నేహితులను కలిసారు. దీంతొ వారు ఎవరెవరిని కలిసారో ఎవరికి వైరస్ సోకిందన్న అనుమానాలు ఆ గ్రామస్తుల్లో నెలకొన్నాయి.

కరోనా బాధితులు నివాసముండే మధురా నగర్‌లో నివసించే ప్రజలు ఎక్కుగా భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో చేసేదేమి లేక ఆ ప్రాంత ప్రజలు సుమారుగా 100 నుంచి 150 కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలేసి తమ పంటపొలాల్లో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని వెల్లిపోయారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories