ఏసీబీ వలలో అవినీతి చేప...

peddapalli ADA officer
x
peddapalli ADA officer
Highlights

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏగా పని చేస్తున్న కృష్ణరెడ్డి పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు.

పెద్దపల్లి : ఏసీబీ వలకి మరో అవినీతి చేప చిక్కింది. అవినీతికి పాలుపడుతున్నఅధికారులను ఏసీబీ పట్టుకుంటున్నప్పటికి వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా అనిశాకి మరో అవినితి చేప చిక్కింది..పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏగా పని చేస్తున్న కృష్ణరెడ్డి పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి, ఎరువుల దుకాణం ఏర్పాటు కోసం సదరు అధికారికి దరఖాస్తు పెట్టుకున్నాడు . కానీ పదివేల రూపాయలు లంచంగా ఇవ్వాలని సదరు అధికారి లక్ష్మణ్ ని డిమాండ్ చేసాడు. దీనితో లక్ష్మణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీనితో ఏసీబీ అధికారులు అతన్ని పక్కా స్కెచ్ వేసి పట్టుకున్నారు.

keywords : peddapalli,ADA officer, bribe,Acb

Show Full Article
Print Article
More On
Next Story
More Stories