ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం...

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధం...
x
Highlights

సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో...

సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని రామచంద్రాపురంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. ఆ సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉండడం గమనార్హం. దీంతో ప్రయాణికులంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు.

పూర్తి వివరాల్లోకెలితే ముంబయి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం సమీపంలోకి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి బస్సు ముందు భాగం ఇంజన్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అది గమనించి డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపేసాడు. ప్రయాణికులందరినీ హడావుడిగా కిందకు దించారు. ప్రయాణికులు దిగిన వెంటనే క్షణాల్లో బస్సు కాలి బూడిదైంది.

వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, ప్రయాణికుల లగేజీ మొత్తం కాలిబూడిదైంది. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories