ప్రేమ జంట దాడిలో గాయపడ్డ యువకుడు మృతి

ప్రేమ జంట దాడిలో గాయపడ్డ యువకుడు మృతి
x
Highlights

అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రేమ జంట చేసిన దాడిలో గాయపడిన...

అర్ధరాత్రి ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రేమ జంట చేసిన దాడిలో గాయపడిన యువకుడు సాయి సాగర్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు తేల్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సీసీకెమెరాల పుటేజి చూపించమన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రెండు రోజుల క్రితం మంగళ్ హాట్ సఫానగర్‌కు చెందిన సాయిసాగర్ మిత్రుడి జన్మదిన వేడుకలు జరిపేందుకు నెక్లెస్ రోడ్డుకు వెళ్లాడు. అయితే మోబిన్ ఖాన్ అనే వ్యక్తి తన ప్రియురాలితో బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటే సాయిసాగర్ ప్రశ్నించాడని అతడి స్నేహితులు చెబుతున్నారు. దీంతో మోబిన్ సాయిసాగర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడని అంటున్నారు. ఇది చూసిన తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని, అయితే పోలీస్ స్టేషన్‌లో కూడా సాయిసాగర్‌పై మోబిన్ దాడి చేశాడని చెబుతున్నారు. మోబిన్‌పై ఇప్పటికే 16 కేసులు ఉన్నాయని, పీడీ యాక్టులో అరెస్ట్ కూడా అయ్యాడని తెలిపారు. కాసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రిలో సాయిసాగర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. మంగళ్ హాట్‌కు మృతదేహాన్ని తరలించారు. అయితే దాడిలో చనిపోయిన సాయిసాగర్‌కు 20 రోజుల క్రితమే వివాహం జరిగింది. దీంతో భార్యతో సహా కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories