ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదు : మంత్రి నిరంజన్‌రెడ్డి
x
Highlights

తెలంగాణలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టంచేశారు. దుబ్బాకలో యూరియా దొరక్క రైతు చనిపోలేదని, అతడి మృతి యాదృచ్చికంగా జరిగిందని...

తెలంగాణలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టంచేశారు. దుబ్బాకలో యూరియా దొరక్క రైతు చనిపోలేదని, అతడి మృతి యాదృచ్చికంగా జరిగిందని చెప్పారు. ఈ విషయంపై దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తో మాట్లాడాను అని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అంటే గిట్టని వారే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. మాదాపూర్ హైటెక్స్ లో అగ్రి టెక్స్ 7వ ఎడిషన్ 2019ను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఏ జిల్లాకు ఎంత స్టాక్ యూరియా అవసరం, ఇంకా ఎంత డిమాండ్ ఉంది అని మినట్ టు మినట్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories