అమీన్‌పూర్‌ మైనర్ కేసు: లవర్ తో సినిమా కెళ్లి అత్యాచారం అంటూ డ్రామా

అమీన్‌పూర్‌ మైనర్ కేసు: లవర్ తో సినిమా కెళ్లి అత్యాచారం అంటూ డ్రామా
x
Highlights

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఘటనపై మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ వార్త సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. అందరు అనుకుంటున్నట్టుగా ఎటువంటి అత్యాచారం జరగలేదని పోలీసులు దీనిపైన క్లారిటీ ఇచ్చారు.

ఇంతకి జరిగింది ఏమిటి ?

తనపై ముగ్గరు అత్యాచారం చేశారని చెప్పడంతో సదరు బాలిక తల్లితండ్రులు వెంటనే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన అమీన్‌పూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణలో భాగంగా ఆ బాలికను పలు ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకి బాలిక పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీనితో ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని తెలిసింది. దీనితో పోలీసులు తమ స్టైల్ లో దర్యాప్తు చేయగా అసలు విషయాలు బయటపడ్డాయి.

సినిమాకి వెళ్లి .. తల్లితండ్రులకి భయపడి...

అక్కడ స్థానికంగా సందీప్‌ అనే యువకుడు తనని సినిమాకు తీసుకెళ్లాడని, ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులకి తెలిస్తే తనని తిడతారన్న భయంతో బాలిక అత్యాచారం జరిగినట్లు చెప్పింది. దీంతో పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా దీనిపైన తప్పుడు తప్పుడు ప్రచారం చేసిన ఆ బాలిక ఇంటి యజమానిపై కేసు పెట్టినట్లు సంగారెడ్డి జిల్లా్ ఎస్పీ తెలిపారు. ఇలాంటివి జరిగినప్పుడు కంగారు పడకుండా సమయస్ఫూర్తితో ఆలోచించాలని పోలీసులు హితవు పలికారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories