మాంసం దుకాణాలకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ

మాంసం దుకాణాలకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ
x
Highlights

కోడి, మేక, చేప, ఇతర మాంసం దుకాణాల దారులకు రాష్ట్ర పురపాలక శాఖ కొన్ని నిబంధనలను జారీ చేసింది.

కోడి, మేక, చేప, ఇతర మాంసం దుకాణాల దారులకు రాష్ట్ర పురపాలక శాఖ కొన్ని నిబంధనలను జారీ చేసింది. నిబంధనలను పాటించకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మాంసం దుకాణాల్లో మిగిలిపోయే వ్యర్ధాల కారణంగా క్రిమి కీటకాలు తయారయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నందున పురపాలక శాఖ ఈ నిబంధనలను జారీ చేసిట్టు తెలిపింది. పశు వధశాలల వ్యర్థాలను బయో మెథనేషన్‌ ప్రక్రియ ద్వారా అక్కడికక్కడే నిర్వీర్యం చేయాలని తెలిపారు. పట్టణాల్లో ఉన్న మాంసం దుకాణాలన్నింటినీ గుర్తించి వాటికి సంబంధించిన వ్యర్థాల సమీకరణ, తరలింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ ఆదేశించారు. అంతే కాక మరికొన్ని నిబంధనలను కూడా పెట్టారు.

ప్రతి మాంసం దుకాణాల్లో లీక్‌ ప్రూఫ్‌ చెత్తబుట్టలు ఉపయోగించాలని సూచించారు. దుకాణాల పరిసరాల్లో నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి, డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలన్నారు. ఫినాయిల్, బ్లీచింగ్‌ పౌడర్‌ వంటి కీటక నివారిణిలను క్రమం తప్పకుండా దుకాణ ప్రాంగణంలో చల్లాలని సూచించారు. మాంసం కోసినపుడు వెలువడే వ్యర్ధాలు రోజుకు టన్ను కంటే ఎక్కువ మొత్తంలో ఉంటే వాటిని బయో మెథనేషన్‌ ప్రక్రియ ద్వారా నిర్వీర్యం చేయాలన్నారు. అంత కంటే తక్కువ మొత్తంలో వ్యర్ధాలు ఉంటే పట్టణాలకి బయట, జనావాసం లేని ప్రదేశాల్లో అత్యంత లోతుగా పూడ్చి వేయాలన్నారు.

పనిచేసే వర్కర్లు తప్పని సరిగా అప్రాన్‌లు, హెడ్‌గేర్, గ్లౌజులను ధరించాలని, కార్మికులకు చర్మవ్యాధులు ఉండరాదు, గోళ్లు పెంచుకొని ఉండరాదన్నారు. చిన్నపిల్లలను దుకాణాల్లో పనికి పెట్టకోరాదన్నారు. పనిముట్లు, కంటైనర్లను క్రమం తప్పకుండా వేడి నీళ్లతో కడగాలని సూచించారు. మాంసం వ్యర్థాలతో ఎరువుల తయారీకి అవకాశం ఉంటే పరిశీలన జరపాలని. ఇలా తయారైన ఎరువులను హరితహారం కోసం వినియోగించాలని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వినియోగదారులు వెంటనే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇందుకు గాను దుకాణాలలో మున్సిపల్‌ అధికారుల పేర్లతో దుకాణంలో బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories