హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో నందమూరి సుహాసిని

హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో నందమూరి సుహాసిని
x
Highlights

హుజూర్ నగర్ లో ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది.

హుజూర్ నగర్ లో ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు దేశం అభ్యర్థి కిరణ్మయికి మద్దతుగా నందమూరి సుహాసినిని ప్రచార బరిలోకి దించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.

ఇతర పార్టీలకు దీటుగా టీడీపీ ప్రచారాన్ని నిర్వహించనున్నాయి. తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలంగానే ఉందని చాటి చెప్పేందుకు గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. తాజాగా, కిరణ్మయికి మద్దతుగా ప్రచారం చేసేందుకు దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దించాలని నిర్ణయించింది.

రేపటి నుంచి మూడు రోజుల పాటు సుహాసిని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని, సుహాసిని ప్రచారం చేయడం వల్ల మహిళల ఓటు బ్యాంకు పెరుగుతుందని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు మరోవైపు, నందమూరి బాలకృష్ణ కూడా టీడీపీ గెలిపునకు ప్రచారం నిర్వహించబోతున్నారని సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories