కాజీపేట ట్రైన్ కేసును విచారించిన నాంపల్లి స్పెషల్‌ కోర్టు

కాజీపేట ట్రైన్ కేసును విచారించిన నాంపల్లి స్పెషల్‌ కోర్టు
x
Highlights

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కాజీపేటలో జరిగిన ట్రైన్ హైజాక్ కేసు నాంపల్లి స్పెషల్‌ కోర్టు విచారించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది....

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కాజీపేటలో జరిగిన ట్రైన్ హైజాక్ కేసు నాంపల్లి స్పెషల్‌ కోర్టు విచారించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. 8 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ A1 నిందితుడిగా ఉండగా, వరంగల్ కు చెందిన మరో 18 మంది టీఆర్ఎస్, బిజెపి నేతలు సహ నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఏప్రిల్ 14, 2011లో కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ప్రయాణికులతో వెళుతున్న కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ ను టీఆర్ఎస్ నేతలు నిలిపివేశారు. ఉదయం 6 గంటలకు రైలును ఆపగా దాదాపు పన్నెండు గంటలపాటు రైలు అక్కడే నిలిచిపోయింది. దీనిని తీవ్ర నేరంగా పరిగణించిన రైల్వే శాఖ ఆందోళనకారులపై రైలు హైజాక్ కేసు నమోదు చేసింది. ఈ ఆందోళనను ముందుండి నడిపించారు అంటూ వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ A1 నిందితుడిగా పేర్కొన్నారు.

వినయ్ భాస్కర్‌తో పాటు మరో 18 మందినీ సహ నిందితులుగా ప్రస్తావించారు. వీరిలో ఇద్దరు స్థానిక బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఈ కేసు గత ఎనిమిదేళ్లుగా వరంగల్ లోని రైల్వే కోర్టులో విచారణ సాగుతోంది. ఇటీవలే ఈ కేసును నాంపల్లిలోని కోర్టుకు బదిలీ చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం రేపు ఉదయం 10 గంటలకు నాంపల్లి రైల్వే కోర్టు తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. రైల్ రోకో లాంటి సంఘటనలు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగాయి. ఈ కేసుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, మాజీ ఎంపీ కవిత తో పాటు అనేకమంది సీనియర్ నేతలు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories