కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి
x
కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి
Highlights

నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి ఏఎంఆర్పీ కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు....

నల్గొండ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి ఏఎంఆర్పీ కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఓ బాలుడిని స్థానికులు రక్షించారు. కారు ముందు టైరు పేలడంతో కారు అదుపు తప్పి కాలువలోకి వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. మృతులు వడ్డెరిగూడేనికి చెందిన వారిగా గుర్తించారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. పీఏపల్లి మండలం దుగ్యాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories