ఉద్రిక్తత.. కలెక్టరేట్‌లో 11 మంది రైతుల ఆత్మహత్యాయత్నం

ఉద్రిక్తత.. కలెక్టరేట్‌లో 11 మంది రైతుల ఆత్మహత్యాయత్నం
x
ఉద్రిక్తత.. కలెక్టరేట్‌లో 11 మంది రైతుల ఆత్మహత్యాయత్నం
Highlights

నాగర్‌ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు పెంట్లవెల్లి మండలం గోకులపురం గ్రామానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. తమకు చెందిన రెండున్నర ఎకరాల భూమికి...

నాగర్‌ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు పెంట్లవెల్లి మండలం గోకులపురం గ్రామానికి చెందిన రైతులు ధర్నాకు దిగారు. తమకు చెందిన రెండున్నర ఎకరాల భూమికి పెంట్లవెల్లి తాహశీల్దార్ తమకు పాసు బుక్‌లు ఇవ్వడం లేదని 11మంది రైతులు నిరసన తెలిపారు.

తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జాచేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రెవిన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టంచుకోవడం లేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ భవనంపైకి ఎక్కిన రైతులు కిరోసిన్ పోసుకున్నారు. అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు రైతులను అడ్డుకొని కిరోసిన్ బాటిళ్లను లాక్కొని కిందకు దింపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories