పీఎం కేర్స్‌కు ఎంపీ బండి సంజయ్ రూ.కోటి విరాళం

పీఎం కేర్స్‌కు ఎంపీ  బండి సంజయ్ రూ.కోటి విరాళం
x
Bandi Sanjay(File Photo)
Highlights

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడాప్రముఖులు తమవంతుగా సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోటి రూపాయలు, ఒక నెల జీతం లక్ష రూపాయలను పీఎం కేర్స్ సహాయ నిధికి విరాళం ఇచ్చారు.

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి రూ.50 లక్షలను కేటాయించినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మరిని తరిమేద్దాం – దేశాన్ని గెలిపిద్దామ‌ని నినాదం ఇచ్చిన 2 గంటల వ్యవధిలోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఈ మేరకు పీఎం కేర్స్ ఫండ్‌కు రాష్ట్ర భాజపా కార్యకర్తలు భారీగా విరాళాలు ఇచ్చారనీ.. వారందరికీ ధన్యవాదాలు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories