లాక్‌డౌన్ ఉందని ఆపితే.. పోలీసుపై తల్లీకొడుకు దాడి !

లాక్‌డౌన్ ఉందని ఆపితే.. పోలీసుపై తల్లీకొడుకు దాడి !
x
Highlights

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మెజార్టీ ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ.. కొందరు...

కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మెజార్టీ ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం మూర్ఖంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఏ మాత్రం లెక్క‌చేయ‌డం లేదు. ఇక కొంద‌రైతే అడ్డుకున్న‌ పోలీసులపై దాడుల‌కు కూడా తెగ‌బ‌డుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే శుక్ర‌వారం మ‌ల్కాజిగిరి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకున్న‌ది.

ఒకే ద్విచక్ర వాహనంపై యువకుడితో పాటు తల్లిదండ్రులు ప్రయాణిస్తున్నారు. గమనించిన ఓ కానిస్టేబుల్‌ వారిని ఆపి లాక్‌డౌన్‌ అమల్లో ఉందని ద్విచక్ర వాహనంపై ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణించకూడదని వారించారు. దీంతో ఆ యువకుడితో పాటు అతడి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురై కానిస్టేబుల్‌ చొక్కా పట్టుకుని దాడి చేశారు. దీంతో ద్విచ‌క్ర‌వాహనం న‌డుపుకుంటూ వ‌చ్చిన యువ‌కుడిని పోలీసులు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories