మహిళపై కోతుల గుంపు దాడి.. మహిళ మృతి !

మహిళపై కోతుల గుంపు దాడి.. మహిళ మృతి !
x
మహిళపై కోతుల గుంపు దాడి.. మహిళ మృతి !
Highlights

దండులా దండయాత్ర చేస్తాయి అడ్డం వచ్చారంటే ఇక అంతే సంగతులు, అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని ఆహారం,...

దండులా దండయాత్ర చేస్తాయి అడ్డం వచ్చారంటే ఇక అంతే సంగతులు, అడవిలో ఉండాల్సిన జంతువులు జనారణ్యంలోకి వస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొన్ని ఆహారం, నీళ్ల కోసం జనారణ్యంలోకి వస్తుండగా మరికొన్ని దారితప్పి గ్రామాల్లోకి వస్తూ అలజడి సృష్టిస్తున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో కోతుల గుంపు మహిళపై దాడి చేశాయి. కోతుల గుంపు దాడిలో మహిళ మృతి చెందింది. బోథ్‌లో కోతుల గుంపు జంగుబాయి అనే మహిళ ఇంటిపైకి వచ్చాయి. జంగుబాయి కోతుల గుంపును కొట్టేందుకు ప్రయత్నించింది. ఆగ్రహంతో కోతులు మూకుమ్మడిగా ఆమెపై దాడి చేశాయి. తీవ్ర గాయాలతో జంగుబాయి ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కోతుల విధ్వంసంపై అటవీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కోతుల దాడిలో చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు బోథ్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి సత్యనారాయణ. జంగుబాయి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. జంగుబాయి మృతిలో తమ వైఫల్యం లేదన్నారు బోథ్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి సత్యనారాయణ‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories