కవిత ఓటమిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

కవిత ఓటమిపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
x
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాలలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ...

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాలలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇటివల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలిచుంటే ఎంతో కొంత నిజామాబాద్‌లో అభివృద్ధి జరిగేదని వ్యాఖ్యానించారు. అసలు టీఆర్ఎస్ నేతలకు తెలివే లేదని.. అసలు వాళ్లకేగని తెలివి ఉంటే మొన్నటి ఎన్నికల్లో కవితను ఓడిస్తారా ?. ఆ పార్టీలో గ్రూపుల కుమ్ములాటలే కవితను ఓడించాయని అన్నారు. ఈరోజు కవితకు తీరని అన్యాయం చేసింది కేవలం టీఆర్ఎస్ పార్టీ నేతలే అని పెర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంద్రాగష్టు లోపు పథకాల అమలు మీద స్పష్టత ఇవ్వాలి అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా ఈరోజు జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు గులాబీ అధిష్టానం, టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే మరి. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కవితపై 68 వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories