టికెట్ల లొల్లి..మంత్రి ఆడియో వైరల్..

టికెట్ల లొల్లి..మంత్రి ఆడియో వైరల్..
x
టికెట్ల లొల్లి..మంత్రి ఆడియో వైరల్..
Highlights

మేడ్చల్‌ జిల్లాలో మున్సిపల్‌ టికెట్ల పంచాయతీ హీట్ పుట్టిస్తోంది. మంత్రి మల్లారెడ్డి- బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మాట్లాడిన ఫోన్...

మేడ్చల్‌ జిల్లాలో మున్సిపల్‌ టికెట్ల పంచాయతీ హీట్ పుట్టిస్తోంది. మంత్రి మల్లారెడ్డి- బోడుప్పల్‌కు చెందిన టీఆర్ఎస్ నేత రాపోలు రాములుతో మాట్లాడిన ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టికెట్ల కోసం డబ్బులు అడిగిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయంటూ మంత్రి మల్లారెడ్డితో రాపోలు రాములు మాట్లాడినట్టుగా ఆ ఆడియోలో ఉంది.

రాపోలు రాములు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తనకు టికెట్‌ రాలేదనే అక్కసుతోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడన్నారు. రాములు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. రాములు నిజంగా తనకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories