హై-లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హై-లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
x
Highlights

రూ. 4 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని మహబూబ్ నగర్ జిల్లాలోని మూసాపేట్ మండలం పోల్కంపల్లి వద్ద క్రిడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదీగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ఉద్యమాకారులతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.

రూ. 4 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని మహబూబ్ నగర్ జిల్లాలోని మూసాపేట్ మండలం పోల్కంపల్లి వద్ద క్రిడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదీగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో ఉద్యమాకారులతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తరువాతనే మనకు కావాల్సిన పనులు చేసుకోగలుగుతున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టరని అన్నారు. ప్రజల మంచి కోరే సీఎం ఉండటం మన అదృష్టమని అన్నారు. పోల్కంపల్లి బ్రిడ్జి ఎప్పుడో నిర్మించాల్సింది. కానీ, ఆంధ్ర పెత్తందార్ల చేతుల్లో ప్రభుత్వం ఉండడం వల్ల ఇలాంటి ఎన్నో పనులు కార్యరూపం దాల్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories