మరోమారు ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా.. నూతన మున్సిపాలిటీలకు మాత్రమే

మరోమారు ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా.. నూతన మున్సిపాలిటీలకు మాత్రమే
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం మరోమారు ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి తెలిపింది. రాష్ట్రంలో...

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం మరోమారు ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి తెలిపింది. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త మున్సిపాలిటిల్లో ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్‌ మేళా నిర్వహణకు పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌, గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలపై నగరంలోని ఎంసీహెచ్‌ఆర్డీలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మున్సిపాలిటీల్లో మార్పు కనిపించేలా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉన్నందని ఆయన స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలోనే పట్టణాలను, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. రోడ్లు, పచ్చదనం, శ్మశానవాటికల నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. నూతన పురపాలక చట్టాన్ని పౌర సేవలే కేంద్రంగా తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

ఈ చట్టంలోని విధులు కచ్చితంగా పాటించేలా అధికారులు పనిచేయాలన్నారు. ఇకపోతే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, అందులో విలీనమైన గ్రామాలకు మరోమారు ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించనుందని ఆయన తెలిపారు. కొత్త మున్సిపాలిటీల్లో సెప్టెంబర్‌ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువును పొడిగించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్‌ ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. 43 కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించిందని ఆయన స్పష్టం చేసారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories