కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
x
కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
Highlights

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్...

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో తెలంగాణ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో జరిగే బయో ఆసియా సదస్సుకు రావాల్సిందిగా పీయూష్ గోయెల్ ను కేటీఆర్ ఆహ్వానించారు.

ఢిల్లీలో పర్యటనలో ఉన్న కేటీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో భేటీ అయ్యారు. వరంగల్-హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ - నాగ్ పూర్ రెండు కొత్త కారిడార్ లను మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్-బెంగళూర్-చెన్నైను కలుపుతూ దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్ట్ తో పాటు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు కేంద్రం సాయం చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన అంశాలపైన వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని తన కార్యాలయ సిబ్బందిని పీయూష్ గోయెల్ ఆదేశించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories