హైదారాబాద్ రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ : మంత్రి కేటీఆర్

హైదారాబాద్ రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ : మంత్రి కేటీఆర్
x
Highlights

నగర వాసులు ఎప్పటినుంచో ఎదురు చుస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోరైలు కారిడార్ ను ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నవిషయం తెలిసిందే. ఈ...

నగర వాసులు ఎప్పటినుంచో ఎదురు చుస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోరైలు కారిడార్ ను ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజున ప్రగతిభవన్ లో రాష్ర్ట పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పలువురు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మూడో కారిడార్ ప్రారంభంతో దేశంలోనే హైదారాబాద్ మెట్రో రైల్ రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్ గా అవతరిస్తుందన్నారు.

ఈ నేపథ్యంలోనే 7వ తేదీని జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటు, నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందువల్లను ఏర్పట్లన్నీ పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుడా చూడాలని, కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమయిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని మెట్రో అధికారులను మంత్రి అదేశించారు. ఈ లైన్ ద్వారా మెట్రో ఎంతో మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని తెలిపారు. ఈ మెట్రో ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్ సమస్యలను కూడా అధిగమించవచ్చని తెలిపారు. ఇక పోతే హైదరాబాద్ నగరానికే మణిహారంగా ఉన్న మెట్రో సర్వీసులకు మరింత పేంచేందుకు శంషాబాద్ వరకు అతి త్వరలో లైన్ పొడగింపు చేస్తామని ఆయన తెలిపారు.

ఇక ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహాన్ లతో పాటు హైదరాబాద్ మెట్రోరైల్, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖాధికారులు, నగర పోలీస్ కమీషనర్, ఎల్ అండ్ టి ప్రతినిధులు పాల్గొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories