వేముల‌వాడ రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

వేముల‌వాడ రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
x
Highlights

శివరాత్రి వేడుకల సందర్భంగా వేముల‌వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

శివరాత్రి వేడుకల సందర్భంగా వేముల‌వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. ఈ సందర్బంగా మంత్రికి ఆయన కుటుంబసభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కుటుంబ స‌మేతంగా స్వామివారిని ద‌ర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆలయ వేద‌పండితుల ఆశీర్వచనాలను తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ జాతర సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పేర్కొన్నారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. అనంతరం టీటీడీ అర్చ‌కులు, అధికారులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి శ్రీవెంక‌టేశ్వ‌ర స్వామి వారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్, ఆల‌య ఈవో కృష్ణ‌వేణి, త‌దిత‌రులు ఉన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories