మంత్రి పీఏకు క‌రోనా..హోంక్వారంటైన్‌లోకి హ‌రీశ్‌రావు !

మంత్రి పీఏకు క‌రోనా..హోంక్వారంటైన్‌లోకి హ‌రీశ్‌రావు !
x
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడయితే లాక్ డౌన్ ను నిబంధనలను సడలించిందో అప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా...

తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడయితే లాక్ డౌన్ ను నిబంధనలను సడలించిందో అప్పటి నుంచి రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాలలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులతో పాటు ప్రస్తుతం నాయకులకు, వారి వద్ద పనిచేసే వారికి కూడా కరోనా సోకుతుంది.

తాజాగా మంత్రి హ‌రీశ్‌రావు పీఏకు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. దీంతో మంత్రి హ‌రీశ్ రావుతో పాటు కుటుంబ స‌భ్యులుహోం క్వారంటైన్‌లోకి వెళ్లిన‌ట్లు స‌మాచారం. సిద్దిపేటలో ఆయన నివాసంలోని వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో మంత్రికి, 17 మందికి నెగెటివ్‌ వచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories