ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల

ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. హైదరాబాద్ లో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో రోగులను చేర్చేకునేందుకు స్థలం లేక వెనక్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. హైదరాబాద్ లో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో రోగులను చేర్చేకునేందుకు స్థలం లేక వెనక్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో జ్వరంతో బాధపడుతున్న రోగులను నేడు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. వైద్యులతో కలిసి ఆసుపత్రిలోని వార్డలన్నీటిని పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సకాలంలో వైద్యం అందించాలని అక్కడ వైద్య సిబ్బందికి సూచించారు. విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందిని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories