షైన్ ఆస్పత్రి ఘటనపై మంత్రి ఈటల సమీక్ష..24 గంటల్లో రిపోర్టు అందజేయాలని ఆదేశం

షైన్ ఆస్పత్రి ఘటనపై మంత్రి ఈటల సమీక్ష..24 గంటల్లో రిపోర్టు అందజేయాలని ఆదేశం
x
Highlights

షైన్ పిల్లల ఆసుపత్రి ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ నుంచి సమీక్షించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు....

షైన్ పిల్లల ఆసుపత్రి ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ నుంచి సమీక్షించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కమిటీ ఏర్పాటు చేశారు. 24 గంటల్లో రిపోర్టు అందజేయాలని ఆయన ఆదేశించారు.

సోమవారం తెల్లవారుజామున షైన్ పిల్లల ఆసుపత్రిలో నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ చిన్నారుల్లో ముగ్గురిని ఉప్పల్‌ శ్రద్ధ ఆస్పత్రికి తరలించినా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 42 మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్‌ సేఫ్టీ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండానే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో 304 A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆస్పత్రిని సీజ్‌ చేశారు. మరోవైపు వైద్యుడు సునీల్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories