జూడాలతో ఫలించిన మంత్రి ఈటల చర్చలు

జూడాలతో ఫలించిన మంత్రి ఈటల చర్చలు
x
Highlights

గాంధీ ఆస్పత్రిలో రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రంగంలోకి దిగి చర్చలు జరపడంతో...

గాంధీ ఆస్పత్రిలో రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు. స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రంగంలోకి దిగి చర్చలు జరపడంతో జూడాలు వెనక్కి తగ్గారు. చర్చలు సఫలం కావడంతో జూనియర్ డాక్టర్లు వెంటనే విధుల్లోకి చేరారు. అయితే, జూడాలు పెట్టిన ఐదు డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాన్నారు.

అయితే, చర్చలకు ముందు జూడాల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. న్యాయం చేయాలంటూ గాంధీ ఆస్పత్రి బయట రోడ్డుపై ధర్నా చేపట్టారు. అడ్మినిస్ట్రేషన్ తప్పులకు తమపై దాడులు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గేట్లు తోసుకుంటూ ఆస్పత్రి లోపలికి దూసుకెళ్లారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories