ఈ రెండు లక్షణాలున్న అందరికీ టెస్టులు చేయండి: ఈటల

ఈ రెండు లక్షణాలున్న అందరికీ టెస్టులు చేయండి: ఈటల
x
Etela Rajendar(File photo)
Highlights

తెలంగాణలోని వైద్య సిబ్బందితో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

తెలంగాణలోని వైద్య సిబ్బందితో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్యాధికారులు, ఆసుపత్రుల సుపరింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ అధికారులు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి ఇన్‌ఫ్లుయెంజా లక్షణాలు ఉన్న వారితో పాటు (ఊపిరితిత్తుల్లో న్యుమోనియా) ఉన్న వారికి కచ్చితంగా టెస్టులు చేయాలని సూచించారు. ప్రతీ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పరీక్షలు నిర్వహించాలని మంత్రి వైద్య సిబ్బందిని కోరారు.

అనంతరం కరోనాకు సంబంధించి గ్రామాల్లో, పట్టణాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్‌ పలువురు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం వర్కర్లతో మాట్లాడారు. ఇటీవల సారి పేషెంట్లకు కరోనా టెస్టులు చేయగా కొందరికి పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. సారి (సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్) లక్షణాలు కరోనా లక్షణాలతో పోలి ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ యోగీతా రాణా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు, టిఎస్‌ఐఎండిసి ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడీ, ఎక్స్పర్ట్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories