ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్‌కు ఘోర పరాజయం.. ఎంఐఎం విజయం !

ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్‌కు ఘోర పరాజయం.. ఎంఐఎం విజయం !
x
Highlights

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కానీ నిర్మల్‌ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది....

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కానీ నిర్మల్‌ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భైంసాలోని ఒక్క వార్డులో బోణీ కొట్టలేకపోయింది. నిర్మల్‌ జిల్లా భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. ఎన్నికల ముందు తీవ్ర ఘర్షణలతో వార్తల్లో నిలిచిన భైంసాలో పుర పోరు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డుల్లో ఎంఐఎం 15 గెలుపొందగా, బీజేపీ 9 స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు రెండు వార్డులను సొంతం చేసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం కనీసం పోటీలో కూడా లేకుండా పోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories