పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
x
Highlights

తెలంగాణకు చెందిన మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండల...

తెలంగాణకు చెందిన మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయాడు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండల కేంద్రానికి చెందిన సుధాకర్‌ దళంలోనే పరిచయమైన తన భార్య నీలిమ అలియాస్‌ మాధవితో కలసి రాంచీలో పోలీసులకు లొంగిపోయారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన సుధాకర్ అలియాస్ కిరణ్ రాష్ట్ర కమిటీ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా అనేక సేవలు అందించారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో సుధాకర్ క్రియాశీలక పాత్ర పోషించారు. సుధాకర్, భార్య మాధవి 2013 నుంచి కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా వీరిద్దరు లొంగిపోయారని తెలుస్తోంది. సుధాకర్‌ దంపతులు పోలీసులకు లొంగిపోవడంతో వారిపై ఉన్న కేసులన్నింటినీ కొట్టివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories