కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..

కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..
x
Representational Image
Highlights

చేతికందొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడనే విషయం తెలియగానే తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగిపోయింది.

చేతికందొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లాడనే విషయం తెలియగానే తట్టుకోలేక ఓ తల్లి గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని మాడవెల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కన్నేపల్లి మండలంలోని మాడవెల్లి గ్రామానికి చెందిన రాదండి సత్యనారాయణ, రాజేశ్వరి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారికి ఉన్న కాస్త భూమిలో ఆరుగాలం కష్టపడి పంటలను పండించేవారు. వారి కష్టాన్ని చూడలేక సత్యనారాయణ పెద్దకొడుకు సంపత్ చదువు మానేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు. సంపత్ స్నహితుడు రాంచరణ్ ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా తమ అమ్మమ ఇంటిక రావడంతో సంపత్ అతన్ని కలిసాడు.

వారిద్దరితో పాటు మరో ముగ్గురు స్నేహితులు సరదాగా వాగులో ఈతకొట్టడానికి వెళ్లారు. సరదాగా ఈ తకొడుతున్న సమయంలో సంపత్, రాంచరణ్ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలియగానే సంపత్ తల్లి రాజేశ్వరి (35) ఒక్క సారిగా కుప్పకూలీంది. విషయం తెలిసిన సమయం నుంచి బెంగతో మంచినీళ్లు తాగకుండా, ఏమి తినకుండా రోదిస్తూ స్పృహ కోల్పోయి అపసార్మక స్థితిలోకి వెళ్లిపోయింది. అది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే గుండెపోటులో మృతిచెందింది. కేవలం 12గంటల వ్యవధిలోనే కట్టుకున్న భార్య, కన్న కొడుకు చనిపోవడంతో సత్యనారాయణ, అతని పదేళ్ల కూతురు దు:ఖ సాగరంలోకి మునిగిపోయారు. ఆ ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories