బైక్‌పై వచ్చి ఉల్లిపాయలు దొంగతనం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు

బైక్‌పై వచ్చి ఉల్లిపాయలు దొంగతనం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
x
సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు
Highlights

నగదు, బంగారం, వెండి, బైక్‌, కార్ల దొంగలను చూసుంటాం కానీ కొత్తగా ఇప్పుడు ఉల్లి దొంగలు పుట్టుకొచ్చారు. ఉల్లి రేట్లు దాదాపు 200 కిలో ఉన్న నేపథ్యంలో...

నగదు, బంగారం, వెండి, బైక్‌, కార్ల దొంగలను చూసుంటాం కానీ కొత్తగా ఇప్పుడు ఉల్లి దొంగలు పుట్టుకొచ్చారు. ఉల్లి రేట్లు దాదాపు 200 కిలో ఉన్న నేపథ్యంలో వెరైటీ దొంగలు బయల్దేరారు. హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని దోమలగూడ మార్కెట్‌లో ఈశ్వరీబాయి అనే మహిళ గత కొన్నేళ్లుగా కూరగాయల వ్యాపారం చేస్తుంది.

శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే వ్యాపారం కోసం కూరగాయల షాప్‌ తెరిచి చూసింది. దుకాణంలో ఉల్లి పాయలు మినహా అన్ని కూరగాయలు ఉన్నాయి. దీంతో ఉల్లిగడ్డలను ఎవరో దొంగిలించారని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ఎవరో ఒక వ్యక్తి తెల్లవారుజామున బైక్‌పై వచ్చి దాదాపు 20 కేజీల ఉల్లిపాయలను ఎత్తుకెళ్లినట్లు గమనించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories