పోలీస్ వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

పోలీస్ వాహనం ఢీ కొని వ్యక్తి మృతి
x
Highlights

పోలీసు వాహనం ఢీ కొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది.

పోలీసు వాహనం ఢీ కొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన ఉప్పల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెలితే చందర్‌రావు (82) కర్మన్‌ఘాట్‌లోని శుభోధయ్‌ కాలనీలో నివాసముంటూ ఘట్‌కేసర్‌లోని ఓ నర్సరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం ఉప్పల్‌లోని స్టేడియం-మెట్రో స్టేషన్‌ ప్తాంతంలో రోడ్డు దాటే సమయంలో కుషాయిగూడ డిటెక్టివ్‌ ఇన్‌స్సెక్టర్‌(డీఐ) వాహనం అతన్ని ఢీ కొంది.

దీంతో రామచందర్‌రావుకి తీవ్రంగా గాయాలు కావడంతో స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన రామచందర్‌రావు శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేయడంతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని హెడ్‌క్వార్టర్‌కు తరలించామని ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories