ఆదర్శ వివాహం.. ఒక్కటైన ప్రేమజంట..

ఆదర్శ వివాహం.. ఒక్కటైన ప్రేమజంట..
x
Highlights

ప్రేమకు శరీరంతో పనిలేదు. మనసుంటే చాలు అని నిరూపించింది ఓ జంట.. వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ...

ప్రేమకు శరీరంతో పనిలేదు. మనసుంటే చాలు అని నిరూపించింది ఓ జంట.. వారిద్దరి ఎత్తులో చాలా తేడా ఉన్నప్పటికీ, వారి మనసులో మాత్రం ఎలాంటి భేదం లేదు. ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుక ముషీరాబాద్‌లోని హెరిటేజ్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌ జరిగింది. వరుడు చిదురాల విద్యాసాగర్‌ (25)ది సిద్దిపేట వాసి. అతని తల్లిదండ్రులు చంద్రమౌళి, నాగమణి గతంలోనే మృతి చెందడంతో అక్క దగ్గరే ఉంటూ చదువు పూర్తి చేశాడు. ఇక వధువు వీరవల్లి శ్రీనివాస్, పద్మ ల కుమార్తె.. రవళి (22). వీరిది సికింద్రాబాద్‌లోని మహంకాళి ప్రాంతం.

రవళికి ఒక సోదరుడు ఉండగా అక్కాతమ్ముడు ఇద్దరూ మరుగుజ్జులే. రవళి ప్రస్తుతం అబిడ్స్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. వరుడు ఎత్తు 5.4 అడుగులు, వధువు ఎత్తు 3.2 అడుగులు వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. అయితే పెళ్లితో ఇద్దరు ఒకటవ్వాలని వధూవరులు నిర్ణయించుకున్నారు. దాంతో ఇద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం, ఇల్లరికం రావాలని కోరగా వరుడు ఒప్పుకోవడంతో గురువారం రాత్రి 8గంటలకు బంధుమిత్రుల సమక్షంలోవీరి పెళ్లి ఘనంగా జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories