తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు : సీఎం కేసీఆర్

తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు : సీఎం కేసీఆర్
x
KCR(File Photo)
Highlights

సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మే 29 వరకు...

సుదీర్ఘ క్యాబినెట్ మీటింగ్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మే 29 వరకు లాక్ డౌన్ ని పొడిగిస్తున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. కరోనా రాష్ట్రంలో అదుపులో ఉందని, ప్రజలు సహకరించాలని కోరారు. కరోనా కట్టడికి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని అన్నారు. ఇక తెలంగాణలో ఆరు రెడ్ జోన్స్, తొమ్మిది గ్రీన్ జోన్స్, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్స్ జిల్లాలు ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు 11 కేసులు నమోదు అయ్యాయని, 43మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 1096 కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనాతో పోరాడి 628 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories