చేపలు ఉచితంగా ఇవ్వలేదనే కోపంతో చెరువులో నుంచి చేపలు లూటీ చేయించిన సర్పంచ్

చేపలు ఉచితంగా ఇవ్వలేదనే కోపంతో చెరువులో నుంచి చేపలు లూటీ చేయించిన సర్పంచ్
x
Highlights

తనకు ఫ్రీగా చేపలు ఇవ్వలేదనే కోపంతో చేపల చెరువును లూటీ చేయించాడు సర్పంచ్.

తనకు ఫ్రీగా చేపలు ఇవ్వలేదనే కోపంతో చేపల చెరువును లూటీ చేయించాడు సర్పంచ్. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం నరసింహపురం బంజర గ్రామంలో వర్ధరాజులు అనే చెరువు ఉంది. ఇందులో మత్స్యాకారులు చేపలు పెంచుతున్నారు.

చేపలు తనకు ఉచితంగా ఇవ్వాలని సర్పంచ్ కోరగా, మత్స్యకారులు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ గ్రామస్తులను పురమాయించి, చెరువులోని చేపలను లూటీ చేయించాడు. గ్రామస్తులు గుంపులు గుంపులుగా వచ్చి చేపలను ఎత్తుకెళ్లారు. చేపలను లూటీ చేయించడంతో పాటు లాక్ డౌన్ ను బ్రేక్ చేయించిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories