కాంగ్రెస్ అధిష్ఠానం, టీపీసీసీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అధిష్ఠానం, టీపీసీసీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
x
Highlights

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ అధిష్ఠానంపై, టీపీసీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, బీజేపీనే...

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ అధిష్ఠానంపై, టీపీసీసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందన్నారు. జరగాల్సిన నష్టం జరిగాక, ఇప్పుడు చర్యలు తీసుకుంటే లాభమేంటని కోమటిరెడ్డి రాజగోపాల్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి, చంద్రబాబు ఏజెంట్‌ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించాలన్న యోచనలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విమర్శించారు. కార్యకర్తలతో చర్చించి త్వరలోనే భవిష్యత్ నిర్ణయం తీసుకుంటామంటున్న మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories