కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు: కడియం

కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు: కడియం
x
Highlights

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు సుమారు 5వేల మంది పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు.

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తికనబరుస్తున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు సుమారు 5వేల మంది పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కాళేశ్వరం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిందో చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. పదవుల కోసం కృష్ణా, గోదావరి నీటి హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణను ఎండబెట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు బీజేపీ ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ.. ఆ పార్టీ అంపశయ్యపై ఉందని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories