రష్మిక ఫోటోల ట్విటర్ వివాదంలో చిక్కకున్న జగిత్యాల కలెక్టర్... పోలీసులకు ఫిర్యాదు

రష్మిక ఫోటోల ట్విటర్ వివాదంలో చిక్కకున్న జగిత్యాల కలెక్టర్... పోలీసులకు ఫిర్యాదు
x
Highlights

ఈ మధ్య కాలంలో మహెశ్ బాబు సరసర కథానాయికగా నటించి వరుస సినిమాలు చెస్తూ హిట్ కొడుతున్న టాలీవుడ్ క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా తన కొత్త ఫోటోలను ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

ఈ మధ్య కాలంలో మహెశ్ బాబు సరసర కథానాయికగా నటించి వరుస సినిమాలు చెస్తూ హిట్ కొడుతున్న టాలీవుడ్ క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా తన కొత్త ఫోటోలను ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో జగిత్యాల కలెక్టర్ ఖాతా నుంచి రష్మిక ఫోటోకు కామెంట్ వచ్చింది దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన భీష్మ ప్రీ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా రష్మిక ప్రత్యేక లాంగ్ లెంగ్త్ స్కర్ట్‌లో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను ఆమె తన ట్విటర్‌ ఖాతాలో తన అభిమానులతో పంచుకున్నారు. దీంతో కలెక్టర్ నుంచి హీరోయిన్ రష్మికా ఫోటోకు 'చించావు పో' అని కామెంట్ రావడం సంచలనం రేపుతోంది. దీంతో జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి ట్విటర్ వివాదంలో చిక్కుకున్నారు.

ఒక జిల్లాను పాలించే అధికారి ఒక బాధ్యతగల స్థానంలో ఉన్న వ్యక్తి హీరోయిన్ ఫోటోకు ఈ విధంగా కామెంట్ ఇవ్వడం ఏంటంటూ నెటిజన్లు కింద కామెంట్లు రాశారు. దీంతో స్పందించిన ఈ విషయం గురించి నాకు తెలియదని, ఎవరో తన ట్విటర్ ఖాతాను హ్యాక్ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, హీరోయిన్ ఫోటోపై కామెంట్లు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. వెంటనే తన ట్విటర్ ఖాతా హ్యాక్ చేసిన వారి గురించి తెలుసుకుని విచారణ జరిపించాలని కలెక్టర్ పోలీసులను కోరారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories