జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జూన్‌ రెండో వారంలో ఇంటర్‌ ఫలితాలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
x
Highlights

జూన్‌ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జవాబు పత్రాల కోడింగ్‌ ఇవాళ మొదలైందని.. ఈ...

జూన్‌ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. జవాబు పత్రాల కోడింగ్‌ ఇవాళ మొదలైందని.. ఈ నెల 12 నుంచి వాల్యుయేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. వాల్యుయేషన్‌కు గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 సెంటర్లకు పెంచినట్లు చెప్పారు. పేపర్‌ వాల్యుయేషన్‌కు వచ్చే లెక్చరర్స్‌కు రవాణా సౌకర్యం, వసతి కల్పిస్తామన్నారు.

మరోవైపు 856 మంది ఇంటర్ విద్యార్థులకు ఒక పరీక్ష మిగిలిపోయిందన్న మంత్రి సబిత... వారికి ఈ నెల 18న పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు కోర్టు అనుమతి తప్పనిసరన్నారు. కోర్ట్ కు అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories