దారుణం..మహిళను స్తంభానికి కట్టేసి.. చెప్పులతో కొట్టి..

దారుణం..మహిళను స్తంభానికి కట్టేసి.. చెప్పులతో కొట్టి..
x
దారుణం..మహిళను స్తంభానికి కట్టేసి.. చెప్పులతో కొట్టి..
Highlights

సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థల వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు అదే గ్రామానికి చెందిన కొంతమంది...

సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థల వివాదంలో జ్యోతి అనే మహిళను స్థంబానికి కట్టేసి చెప్పులతో కొట్టారు అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు. లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన హంస, జ్యోతి, స్వరూప, రమకు పోరెడ్డిపల్లి తండాలో వ్యవసాయ భూములు ఉన్నాయి.

తండాకు చెందిన బాధితురాలు గుగులోత్‌ జ్యోతికి, వీరికి మధ్య పొలానికి వెళ్లే విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం జ్యోతి కి మరో నలుగురు మహిళలతో గొడవ జరిగింది. మాటామాటా పెరిగింది. నలుగురూ తమ భర్తలకు ఈ విషయాన్ని చెప్పారు. వారు ఆ మహిళను లాక్కెళ్లి ఊర్లో స్తంభానికి కట్టేశారు. చెప్పులతో కొట్టారు. బాధితురాలి కుంటుంబ సభ్యులు 100కి కాల్ చేయగా స్థానిక పోలీసులు వచ్చి జ్యోతిని విడిపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories