తెలంగాణ, కర్ణాటక, రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

తెలంగాణ, కర్ణాటక, రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
x
Highlights

తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...

తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వరకు చేరుకున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రానున్న 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అరేబియా సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories