యువకులను చితకబాదిన పోలీసులపై ఐజీ సీరియస్‌

యువకులను చితకబాదిన పోలీసులపై ఐజీ సీరియస్‌
x
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో యువకులను చితకబాదిన పోలీసులు ఐజీ నాగిరెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇద్దరు ఎస్‌ఐలు, ఓ కానిస్టేబుల్, హోంగార్డ్‌లను అటాచ్‌...

రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలో యువకులను చితకబాదిన పోలీసులు ఐజీ నాగిరెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇద్దరు ఎస్‌ఐలు, ఓ కానిస్టేబుల్, హోంగార్డ్‌లను అటాచ్‌ చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిని పోలీస్ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశారు ఎస్పీ రాహుల్‌హెగ్డే.

న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా మద్యం సేవించి యువకులు బహిరంగంగా న్యూసెన్స్‌ చేస్తున్నారన్న అభియోగంతో పోలీసులు వారిని చితకబాదారు. ఈ తతంగాన్ని కొందరు యువకులు అక్కడే ఉన్న బిల్డింగ్‌పై నుంచి వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో.. ఐజీ నాగిరెడ్డి సిరియస్‌గా స్పందించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories