హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం

హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
x
మెట్రో
Highlights

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు మరింత విస్తరించాయి. తాజాగా హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రవాణాశాఖ...

హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు మరింత విస్తరించాయి. తాజాగా హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలను ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

1.5 కి.మీ. మార్గాన్ని హైటెక్‌సిటీలో ప్రారంభించి అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. మెట్రోరైలు కొత్తమార్గం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories